Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
విశ్వరూపం నిషేధానికి కారణం ఆమె.. జయలలితపై కమల్ ఫైర్
గతంలో విశ్వరూపం చిత్రంపై నిషేధం విధించిన తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి నిప్పులు చెరిగారు.
గతంలో విశ్వరూపం చిత్రంపై నిషేధం విధించిన తమిళనాడు ప్రభుత్వంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి నిప్పులు చెరిగారు. విశ్వరూపం చిత్రాన్ని అడ్డుకొన్నద ఎవరో నాకు తెలుసు అని ఇటీవల తమిళ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత జే జయలలితపై పరోక్షంగా తీవ్రంగా విమర్శలు చేశారు.
నాలుగు సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్ కమల్ ఫిల్మ్స్ కేసు నమోదు చేసింది. జయ ప్రభుత్వం తీరు వల్ల నాకు రూ.55 కోట్ల నష్టం వాటిల్లింది. విశ్వరూపంపై నిషేధానికి కారణం కేవలం కొన్ని ముస్లిం సంస్థలే కాదు. కొందరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన నేతలే నాకు సహాయం చేసి కష్టాల నుంచి బయటపడేశారు. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ నేతనే విశ్వరూపం వివాదానికి కారణం అని జే జయలలితపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం సుభాష్ నాయుడు అనే చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. షూటింగ్లో కాలికి గాయం కావడంతో సినిమా నిర్మాణం వాయిదా పడింది. మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, సౌరభ్ శుక్లా నటిస్తున్నారు.