ప్రైవేట్ ఆల్బమ్లో కె. విశ్వనాథ్
తెలుగు జాతి గర్వించదగ్గ కొద్ది మంది దర్శకులలో ఒకరైన కె. విశ్వనాథ్ ఒక ప్రైవేట్ ఆల్బమ్లో దర్శనమివ్వనున్నారు. ఆయన చేస్తున్నారంటేనే అది పాప్ సంగీతమో, మరేదో అనుకోలేం. శివాష్టపది - అనే పేరుతో సుప్రసిద్ధ గీతరచయిత వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఎనిమిది పాటలతో ఒక ఆల్బమ్ రూపొందబోతోంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పార్థసారథి ఈ పాటలను ఆలపించారు. వాయిస్ మిక్సింగ్ పూర్తయ్యాక ఈ పాటలకు తగ్గట్టు విజువల్స్ కూడా చిత్రీకరించాలని ఆల్బమ్ రూపకర్తలు భావిస్తున్నారు. ఇందులో కె. విశ్వనాథ్ చేయనున్నారు. కాపర్తి ప్రొడక్షన్స్ సంస్థ ఈ ఆల్బమ్ని రూపొందిస్తోంది.


Click it and Unblock the Notifications











