Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
15 నుండి వైజాగ్ ఫిల్మ్ ఫెస్టివల్
విశాఖపట్నం: తెలుగు టాకీ సినిమా 83 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఫిల్మ్ సొసైటీ ప్రకటించింది. ఈ మేరకు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశ్ రావు మాట్లాడుతూ...2014 సెప్టెంబర్ 15 నాటికి తెలుగు టాకీ సినిమాకి 83 సంవత్సరాలు పూర్తవుతాయని తెలిపారు. నాటితరం మహానుభావులు ఎంతో మంది చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశిష్ట సేవలందించారన్నారు. వారి త్యాగఫలమే మనం ఇపుడు అనుభవిస్తున్నామన్నారు.
నేటి తరానికి ఆ మహానుభావుల కృషిని తెలియజేసేందుకు మూడు రోజుల పాటు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో 1937లో గూడపల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రైతుబిడ్డ' చిత్రాన్ని, 16న తెలుగు సినిమాకు సంస్కారమద్దిన ‘సాక్షి' చిత్రాన్ని, 17న సాయంత్రం 6 గంటలకు ఉమామహేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘అంకురం' చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని తెలిపారు.