Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అమీర్ ఖాన్ 'పిప్లీలైవ్'ను నిషేధించండి
మొన్న శుక్రవారం రిలీజైన ఆమిర్ఖాన్ 'పిప్లీలైవ్' చిత్రం నిషేధించాలంటూ ఓ వివాదం మొదలైంది. నిర్మాతగా తెరకెక్కించిన 'పిప్లీలైవ్' సినిమాను నిషేధించాల్సిందిగా విదర్భ జనాందోళన్ సమితి ప్రభుత్వాన్ని కోరింది. విదర్భ రైతుల ఆత్మహత్యలపై చిత్ర వైఖరిని అది తప్పుబట్టింది. చిత్రీకరించిన విధానాన్ని వ్యతిరేకించింది. రుణమాఫీ కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడమేకాకుండా రైతుల ఆత్మహత్యల అంశం అంత తీవ్రమైనది కాదన్న రీతిలో చిత్ర కథ సాగిందని సమితి అధ్యక్షుడు కిషోర్ తివారీ ఆరోపించారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.
రుణాలను తీర్చేందుకోసం రైతులు తమ కూతుళ్ళను అమ్ముకున్నట్లుగా టీవీ సీరియల్ 'బైరీ పియా' చూపించగా అందుకు విరుద్ధంగా 'పిప్లీలైవ్'లో చూపించడం రైతులను అవమాన పర్చడమేనన్నారు. గ్లోబలైజేషన్ పేరుతో తప్పుడు విధానాలను అనుసరిస్తూ రైతు బతుకును కాటికీడుస్తున్న ప్రభుత్వాలదే ఈ తప్పంతా అని ఆయన లేఖలో పేర్కొన్నారు. నిర్మాత ఆమిర్ఖాన్ స్క్రిప్ట్ను తయారు చేసుకునేటప్పుడే నిపుణులను సంప్రదించాల్సిందని, భర్తల ఆత్మహత్యలతో వితంతువులుగా మారిన మహిళలకు పరిహారం చెల్లించే అంశాన్ని సినిమా ప్రశ్నార్థకం చేసిందని సమితి ఆరోపించింది. కాగా ఖాన్ సంస్థ తరఫు ప్రతినిధులు మాట్లాడుతూ...తమ చిత్రం రైతుల ఆత్మహత్యల నేపథ్యంతో తీసింది కాదని తెలిపారు.
జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు..వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ నెల 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ సినిమాను 200 ప్రింట్లతో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలైకా షెనాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.