Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దర్శకుడు వియన్.ఆదిత్యకు ట్విస్ట్
మనసంతా నువ్వే తో దర్శకుడు మారిన దర్శకుడు వియన్.ఆదిత్య లేటెస్ట్ గా తరుణ్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆదిత్యను తీసేసి కన్మణిని దర్శకుడుగా ఎంపికచేసినట్లు సమాచారం.కన్మణి ఇంతుకు ముందు 'నా వూపిరి', 'చిన్నోడు',కాల్ సెంటర్ చిత్రాలను రూపొందించారు. అయితే ఆదిత్యను తీసేసి కన్మణి ని ఎందుకు పెట్టుకున్నారన్నది తెలిసి రాలేదు. అయితే కొంత కాలంగా వియన్.ఆదిత్యకీ నిర్మాతకీ మధ్య కొన్ని పొరపొచ్చాలు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో తరుణ్ సరసన విమలారామన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో ఈమె బికినీలో దర్శనమీయబోతోంది. అలాగే తరుణ్ ఓ పాట పాడారు. సుప్రీమ్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాతలు రాజు హర్వాణీ, గోగినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ''14 నుంచి తదుపరి షెడ్యూల్ ఉంటుంది. బ్యాంకాక్లో ఇటీవల ముఖ్య సన్నివేశాల్ని, పాటల్ని తెరకెక్కించాం. వినోదాత్మకమైన ప్రేమ కథ ఇది. నేటి యువతను ఆకట్టుకొనేలా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలోని యువతీయువకుల మనోభావాలకు, జీవనశైలికి అద్దం పడుతుంద''న్నారు. సమర్పణ: ప్రణవ్ స్టూడియోస్, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, పాటలు: రెహ్మాన్, చిన్నిచరణ్, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: గౌతంరాజు.