Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
30 రోజుల్లో ‘ముగ్గురు’ఫినిష్
వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో డా॥డి. రామానాయుడు నిర్మించిన 'ముగ్గురు"చిత్రం షూటింగ్ ముప్పై రోజుల్లో పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్, రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజనా తదితరుల కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి తన మనవడు, సురేష్బాబు తనయుడు సురేష్ అభిరామ్కి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - ''35రోజుల్లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుంది. ఓ కొత్త చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది"" అన్నారు.
''పదిమంది బాగుండాలని కోరుకునే రామానాయుడిగారి సినిమాకి మాటలు రాయడం ఆనందంగా ఉంది"" అని సత్యానంద్ చెప్పారు. ''ఈ చిత్రంలో ఐదు పాటలు రాశాను. వీటిలో ఒక సినిమాకి ఎవరెవరు పని చేస్తారు? వారి ప్రత్యేకత ఏంటి? అని చెప్పే విధంగా రాసిన పాట సంతృప్తినిచ్చింది"" అని చంద్రబోస్ అన్నారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - ''కోటిగారు ఒకే సిట్టింగ్లో అన్ని పాటలకు బాణీలిచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాయికి తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది"" అని చెప్పారు. ఈ చిత్రంలో నటించినందుకు నవదీప్, రాహుల్, అవసరాల శ్రీనివాస్, రీమాసేన్, శ్రద్ధాదాస్, సంజన, సౌమ్య తదితరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.