Don't Miss!
- News సీఎం ఏటీఎం కార్డు అయ్యాడు, అందుకే టూర్లు వేస్తున్నారు, ఎంతకావాలంటే అంత డబ్బులు !
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవన్ కళ్యాణ్ తో చిత్రం గురించి వివి వినాయిక్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, వివి వినాయిక్ ల కాంబినేషన్ లో చిత్రం గురించి చాలా కాలం నుంచి మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఈ విషయమై వినాయిక్ క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ... నేను పవన్ తో తప్పకుండా చేయాలనే కోరికతో ఉన్నాను. కొంత కాలం క్రితం మా ఇద్దరి కాంబినేషన్ లో అనుకున్నాం కానీ.. కథ సెట్ కాలేదు. నేను పవన్ ని బబ్లిగా.. ఎనర్జీగా ఉండే క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నాను. అటువంటి కథలు కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు.
రామ్ చరణ్ తేజ్ నటించిన 'నాయక్' చిత్రం ఈ నెల 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత తన ఖాతాలో హిట్ సినిమా పడటంతో దర్శకుడు వివి వినాయక్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. దాంతో 'నాయక్'ను నెం.1 హిట్ సినిమా నిలబెట్టి నెం.1 దర్శకుడిగా పేరు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు వినాయక్.
ఇందులో భాగంగా దర్శకుడు.... మీడియా ముందుకు రోజూ వస్తున్నారు. సినిమాలో సిద్ధార్థ నాయక్ (రామ్ చరణ్) బావ(రాజీవ్ కనకాల) చనిపోయినప్పుడు చోటు చేసుకున్న సన్నివేశంలో చరణ్ నటన తనను కంట తడి పెట్టించింది. ఏడుపు ఆపుకోలేక పోయాను. నా కంటి నుంచి కొన్ని చుక్కలు నీళ్లు కారాయి. రామ్ చరణ్ ఒక అద్భుతమైన నటుడిగా ఎదుగుతున్నాడు, అందుకు 'నాయక్' సినిమానే నిదర్శనం అంటూ చెబుతున్నారు.
కాగా తొలి రోజు గ్రాండ్ గా 1200లకు పైగా థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన నాయక్ చిత్రం.... భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు కేవలం ఏపిలోనే దాదాపు రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ టాక్. ఇక ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుంటే ఈ మొత్తం మరింత పెరిగి పాత రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కూడా లేక పోలేదు.