Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చరణ్ పెళ్లిలో 'నాయక్'పాట ఐడియా: వివి వినాయిక్
హైదరాబాద్ : రామ్ చరణ్ పెళ్లి సందర్భంగా 'సంగీత్' కార్యక్రమం నిర్వహించారు. అక్కడ 'కొండవీటి దొంగ'లోని ఈ పాటకు అందరూ నృత్యం చేశారు. అక్కడే ఉన్న జె.సి.దివాకర్రెడ్డి కుమారుడు పవన్... 'ఈ పాట మీ సినిమాలో పెట్టొచ్చుగా' అన్నారు. ఆ ఆలోచన నాకు నచ్చింది. వెంటనే చిరంజీవి, చరణ్లకు చెప్పా. వాళ్లూ ఒప్పుకొన్నారు అన్నారు దర్శకుడు వివి వినాయిక్. ఆయన్ని 'నాయక్' సినిమాలో 'శుభలేఖ రాసుకొన్న' పాట రీమేక్ చేస్తున్నారు కదా? ఆ ఆలోచన ఎవరిది? అని ప్రశ్నించినప్పుడు ఇలా స్పందించారు.
రామ్చరణ్ 'నాయక్'గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆయన కెరీర్లోనే గొప్ప వాణిజ్య విలువలున్న సినిమాగా 'నాయక్'ను దర్శకుడు వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్, అమలాపాల్ హీరోయిన్స్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని షామీర్పేటలో జరుగుతోంది. అక్కడ రామ్చరణ్, విలన్ బృందంపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు వినాయక్. 'నాయక్'లో రామ్చరణ్ పాత్రచిత్రణ ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
గతంలో చిరంజీవికి 'ఠాగూర్' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు వినాయక్.ఇప్పుడు చిరంజీవి తనయునితో ఆయన సినిమా చేస్తుండటంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు బలంగా ఉన్నాయి. దాంతో 'నాయక్' మరో 'ఠాగూర్' అంటున్నారు.. దీనిపై వినాయిక్ స్పందిస్తూ... అంత శక్తిమంతమైన కథ. నాయకుడు ఎలా ఉండాలో 'ఠాగూర్'లో చూపించాం. 'నాయక్' మరో కోణం ఆవిష్కరిస్తుంది అన్నారు.
వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న 'నాయక్'ని విడుదల చేయడానికి దానయ్య సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్రెడ్డి, రాహుల్దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, సంగీతం: తమన్.