‘బద్రీనాధ్’ తర్వాత వినాయక్ ఆ యంగ్ హీరోతో కన్ఫర్మ్
'బద్రీనాధ్" చిత్రం తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహించబోయే చిత్రం రామ్చరణ్ దే అని కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రాన్ని 'దేశముదురు" చిత్రం నిర్మించిన దానయ్య ప్రొడ్యూస్ చేయనున్నారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఈ చిత్రం ఉంటుందని, రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్గా నిలవనున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనుందని, హీరోయిన్ తోపాటు టెక్నీషియన్స్ అందర్నీ త్వరలో ప్రకటిస్తామ ని నిర్మాత మీడియాకు తెలియచేసారు. ఇక రామ్ చరణ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..వినాయక్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నానని, నా పాత్ర పవర్ఫుల్గా ఉంటుందని అన్నారు. ఇక ఈ చిత్రంకు ముందిుసంపత్నంది దర్శకత్వంలో 'రచ్చ" అనే చిత్రం ప్రారంభం కానుంది.ఈ చిత్రం ముగింపు దశలోనే ఉండగానే వినాయక్ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది.


Click it and Unblock the Notifications











