Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ చిత్రాలుకు సీక్వెల్స్ చేస్తా: నాగచైతన్య
శివ, గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, మన్మథుడు...ఇలా నాన్న గారు నటించిన వాటిలో ఇష్టమైన చిత్రాలు చాలా వున్నాయి. భవిష్యత్లో అన్నీ కుదిరితే ఈ చిత్రాలను తీసుకొని సీక్వెల్ చేస్తాను. అయితే వాటిని రీమేక్ చేసేలాంటి ఆలోచన ఏమీ లేదు. ఆ ట్రెండ్ సెట్టర్ చిత్రాలను అలానే వుంచాలి అంటున్నారు నాగచైతన్య. తను నటించిన 'ఏ మాయ చేసావె' చిత్రం ఓ ఫీల్గుడ్ లవ్స్టోరీలా 102 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తిచేసుకొని, వంద రోజుల వైపుకు పరుగులుతీస్తోంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో మీడియాతో మాట్లాడుతూ పై విషయం చెప్పుకొచ్చారు. అలాగే నాన్నగారితో 'మీరు కూడా గౌతమ్ తో ఓ సినిమా చెయ్యమని' చెప్పాను అన్నారు. తన త్వరలో చేయబోయే చిత్రాలు గురించి చెబుతూ...కామాక్షి కళా మూవీస్ సంస్థలో ఓ చిత్రం వుంటుంది. ఇటీవలే 'ఆర్య' దర్శకుడు సుకుమార్ చెప్పిన కథ విన్నాను. గీతా ఆర్ట్స్ లో ఈ చిత్రం వుంటుంది. లవ్ ఎంటర్ టైనర్ గా కొనసాగే ఈ కథ కూడా బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్లో వుంది. అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.