ఆ చిత్రాలుకు సీక్వెల్స్ చేస్తా: నాగచైతన్య
శివ, గీతాంజలి, నిన్నేపెళ్లాడతా, మన్మథుడు...ఇలా నాన్న గారు నటించిన వాటిలో ఇష్టమైన చిత్రాలు చాలా వున్నాయి. భవిష్యత్లో అన్నీ కుదిరితే ఈ చిత్రాలను తీసుకొని సీక్వెల్ చేస్తాను. అయితే వాటిని రీమేక్ చేసేలాంటి ఆలోచన ఏమీ లేదు. ఆ ట్రెండ్ సెట్టర్ చిత్రాలను అలానే వుంచాలి అంటున్నారు నాగచైతన్య. తను నటించిన 'ఏ మాయ చేసావె' చిత్రం ఓ ఫీల్గుడ్ లవ్స్టోరీలా 102 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తిచేసుకొని, వంద రోజుల వైపుకు పరుగులుతీస్తోంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో మీడియాతో మాట్లాడుతూ పై విషయం చెప్పుకొచ్చారు. అలాగే నాన్నగారితో 'మీరు కూడా గౌతమ్ తో ఓ సినిమా చెయ్యమని' చెప్పాను అన్నారు. తన త్వరలో చేయబోయే చిత్రాలు గురించి చెబుతూ...కామాక్షి కళా మూవీస్ సంస్థలో ఓ చిత్రం వుంటుంది. ఇటీవలే 'ఆర్య' దర్శకుడు సుకుమార్ చెప్పిన కథ విన్నాను. గీతా ఆర్ట్స్ లో ఈ చిత్రం వుంటుంది. లవ్ ఎంటర్ టైనర్ గా కొనసాగే ఈ కథ కూడా బాగా నచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్లో వుంది. అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











