ఖబడ్దార్ : ఉద్యమ జేఏసీలకు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్
'రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో కొన్ని జేఏసీలు మా హీరో నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అడ్డుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అలాంటి వారందరికీ ఒకటే హెచ్చరిక. మా సినిమా జోలికి రావొద్దు. అలాంటి ఏమైనా జరిగితే మా తడాఖా చూపిస్తాం. మా జోలిక రావొద్దు ఖబడ్దార్' అంటూ హెచ్చరికలు జారీ చేసారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అందుకే మేము మొదటి నుంచి అటు తెలంగాణ ఉద్యమానికి గానీ, ఇటు సమైక్యాంధ్ర ఉద్యమానికి సపోర్టు చేయడం లేదు. కానీ మా హీరో జోలికి వస్తే కేవీపీ అయినా, కావూరి అయినా లేదా కేసీఆర్ అయినా లెక్కచేయమని స్పష్టం చేసారు.
చిరంజీవి తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సమైక్య ఉద్యమంలో పాల్గొనని కారణంగా ఆయన కుటుంబానికి చెందిన సినిమాలను అడ్డుకుంటామని సమైక్యవాదులు ఇటీవల మీడియా ముఖంగా హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆగస్టు 9న విడుదలకు సిద్దం అవుతోంది. సమంత, ప్రణీత హీరోయిన్లు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్య ఉద్యమం తీవ్రమైంది.
ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












