బాలకృష్ణ ఫ్యాన్స్ కు విజ్ఠప్తి ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానలుకు శ్రీరామ రాజ్యం నిర్మాత.. పైరసీ అరికట్టటంలో సహకరించమని విజ్ఠప్తి చేస్తున్నారు. ఈ మేరకు నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేసారు. ఆ ప్రకటనలో నందమూరి బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో నిర్మించిన శ్రీరామ రాజ్యం సినిమాపై సంపూర్ణ కాపీ రైట్స్ ను శ్రీ సాయిబాబా మూవీస్ అను మా సంస్ధ కలిగి ఉన్నది. ఈ సినిమాను యధాతదంగా కానీ, మార్పులతో కానీ, మరియు ఏ విధంగా గానీ ఎవరూ మా సంస్ధ అనుమతి లేకుండా కాపీ చేయటం గానీ,ప్రదర్శించటం చేయలేదు.
ఈ సినిమా విజువల్స్ గానీ, ఆడియోగానీ, ఏ రూపంలో కూడా అనగా డిజిటల్ ఫార్మెట్ లో గానీ, పి 2 పి షేర్ షేరింగ్ రూపంలో గానీ ఆన్ లైన్ అప్ లోడింగ్ మరియు డౌన్ లోడింగ్ గాని చేయట చట్టరీత్యా నేరం. కావున ఎవరైనా కాపీరైట్ చౌర్యానికి పాల్పడిన యెడల శిక్షార్హులు అగుదురు. ఎవరైనా ఈ సినిమా పైరసీ విసిడి, డివిడి కలిగి ఉన్నా, చిత్రాన్ని ఇంటర్ నెట్ లో డన్ లోడ్ చేసినా తమకు సమచారం అందించి సహకరించాల్సింది అని వారు ప్రకటన చేసారు. పైరసీ సమాచారం ఉన్నప్పుడు కంప్లైంట్ చెయ్యాల్సిన ఎడ్రస్..
[email protected], [email protected], www.antipiracytool.com/report.html


Click it and Unblock the Notifications











