Don't Miss!
- News జగన్ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వక్రీకరించవద్దంటూ తారకరత్నకు హెచ్చరిక
వీరశైవ ధర్మం, సంప్రదాయానికి ప్రతీకైన భక్త సిరియాళ చిత్రాన్ని చరిత్రలోని వాస్తవ కథకు అనుగుణంగా చిత్రీకరించాలని పేర్కొన్నారు. 1978 లో తీసిన ఈ సినిమా కన్నడలో వీరశైవ లింగాయత్ల ఆదరణను చూరగొందని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా తెలుగు చిత్రాన్ని నిర్మించాలన్నారు. భక్తిరస చిత్రాలను వాణిజ్యపరంగా వక్రీకరించి చిత్రీకరించడం తగదని హెచ్చరించారు . వి.వి.ఆర్. ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై. లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ముద్దపు రాంబాబు దర్శకునిగా పరిచయమవుతున్నారు.
తారకరత్న మాట్లాడుతూ "ఇది నేను నటిస్తున్న తొలి భక్తి చిత్రం. వీర శైవుడు సిరియాళునిగా నటిస్తుండటం సంతోషంగా ఉంది'' అన్నారు. దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ "భక్తునికీ, భగవంతునికీ మధ్య జరిగే చర్చ ఈ చిత్రం. ఇరవై నిమిషాల గ్రాఫిక్ వర్క్ ఉంటుంది'' అని చెప్పారు. 'శ్రీరామదాసు'లో చేసిన సీత పాత్ర ఎంతో పేరు తెచ్చిందనీ, మళ్లీ తన మనసుకు ఇందులోని పాత్ర నచ్చిందనీ అర్చన తెలిపారు. నిర్మాత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ "ఇప్పటి తరానికి తగ్గట్లు సిరియాళుని కథలో మార్పులు చేసి ఈ సినిమా నిర్మిస్తున్నాం. హిందూత్వాన్ని అభిమానించే వారంతా ఈ సినిమాని ఇష్టపడతారు'' అన్నారు.
సిరియాళుడు గొప్ప శివభక్తుడు. భగవం తునికి... భక్తునికి నిరంతరం అనుసం ధానమైన పరీక్షలు జరుగుతూనే ఉం టాయి. నిరంతరం పరమేశ్వరుని ధ్యానంతో తన జీవితాన్ని పునీ తం చేసుకున్న మహా భాగ్యశాలి సిరియాళుడు ఆ పరమేశ్వరుని కఠిన పరీక్షలలో నెగ్గి తన భక్తిని నిరూపించుకున్న వెైనం ఎంతో గొప్పగా ఉంటుంది. అటువంటి భక్తి నేపథ్యంలో భగవంతుని కన్నా...భక్తే గొప్పదని నిరూపించే భక్తిరస ప్రధాన చిత్రంలో ప్రధాన పాత్రను పోషించనున్నారు.
నారాయణరావు, నాగినీడు, కన్నడ శ్రీధర్, సుబ్బరాయశర్మ, ప్రసన్నకుమార్, రంగనాథ్, హేమసుందర్, హరి, మాస్టర్ విజయ్, శివపార్వతి, భావన, దేవిశ్రీ, సోని, అనూరాధ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: పరాంకుశం భవానీప్రసాద్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, చైతన్యప్రసాద్, పూర్ణచంద్, సంగీతం: మంగళగిరి పూర్ణచంద్, ఛాయాగ్రహణం: శ్రీవెంకట్, కూర్పు: నందమూరి హరి, కళ: భాస్కర్, సహ నిర్మాత: ఎం.ఎల్.కె.డి. ప్రసాద్.