Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పవన్ కి కౌంటర్ గానే సుకుమార్ కి BMW : మరీ ఇంత కక్షా...!?
సినీ ప్రపంచం లో మనకు తెలియని ఎన్నొ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒక్క సినిమా బయటికి రావాలంటే. చాలానే జరుగుతాయి. తెరవెనక రాజకీయాలు కూడా మన ఊహకు అందనంత దూరన్మ్ గానే ఉంటాయి. హీరిఓలూ, డైరెక్టర్లూ, హీరోయిన్ లూ, వీళ్ళంతా నిర్మాతల మీద డిపెండ్ అయినట్టే నిర్మాతలకూ వీళ్ళు కావాలి. ఒకరిపై ఒకరు ఆధారపడ్డ పరిశ్రమలో జరిగే గొడవలు ఎక్కువగా బయటకి రావు... అయితే ఈ మధ్య జరిగిన ఒక సంఘటనతో పవన్ కళ్యాన్ణ్... త్రివిక్రమ్,బీవీఎస్ఎన్ ప్రసాద్ లు ముగ్గురూ వార్తల్లోకెక్కారు..
టాలీవుడ్ అగ్ర నిర్మాత, అగ్ర హీరో మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా అన్న అనుమానం ఇప్పుడు ఒక సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. టాలీవుడ్లో జరుగుతున్న ఇటీవలి పరిణామాలను చూస్తే నిజమేననిపిస్తోందని ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు. అగ్రనిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్ 'అత్తారింటికి దారేదీ' సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఆసమయం లో ఏర్పడ్డ వివాదమే ఇప్పుడు సుకుమార్ కి గిఫ్ట్ తెచ్చిపెట్టింది అనుకుంటున్నారు.ఆ కథ ఇంకా నడుస్తూనే ఉంది... అసలు మొత్తం కథ ఏమిటీ అంటే....
రిలీజ్ తరువాత:
అత్తారింటికి దారేది' ‘సినిమా రిలీజ్ కు ముందే పైరసీ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో నిర్మాత ప్రసాద్ కు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ ను సినిమా రిలీజ్ తరువాత తీసుకుంటామని మాట ఇచ్చారట.
లాభాలను తెచ్చిపెట్టింది:
అయితే పైరసీ ప్రభావం సినిమాపై ఏ మాత్రం చూపలేదు. మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ విషయంలో ప్రసాద్ ను పవన్ ప్రశ్నించగా ‘నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజ్ టైంలో చెల్లిస్తానని చెప్పారట.
మాట్లాడక పోవటం తో:
అయితే పవన్ కు ఇవ్వాల్సిన రెండుకోట్ల అంశంపై ప్రసాద్ మాట్లాడక పోవటం తో విసుగెత్తిపోయిన పవన్ నాన్నకు ప్రేమతో సినిమా రేపు రిలీజ్ అవుతోందనగా ‘మా' అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు.
రెండు కోట్లు :
అత్తారింటికి దారేది సినిమా రెమ్యునరేషన్ విషయంలో బీవీఎస్ఎన్ తనకు రెండు కోట్లు ఇవ్వాల్సి ఉందని, నాన్నకు ప్రేమతో సినిమా విడుదల ముందే మిగతా రెమ్యునరేషన్ ఇస్తానని ప్రసాద్ మాట తప్పారని పవన్ కళ్యాణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నాన్నకు ప్రేమతో:
ఆ వివాదం కొన్ని రోజుల పాటు కొనసాగాక. నాన్నకు ప్రేమతో లో వచ్చిన లాభాలలోనుంచి రెండుకోట్లని పవని అందజేయగా 50లక్షలు తగ్గించుకొని ఒకటిన్నర కోట్లూ మాత్రమే తీసుకున్నాడనీ...
త్రివిక్రం కూడా:
అదే సమయంలో పవన్ తో బాటు రెమ్యూనరేషన్ ఆలస్యం చేసుకున్న త్రివిక్రం కూడా ప్రసాద్ డబ్బులిచ్చినప్పుడు కొంత మొత్తం తగ్గించే తీసుకున్నడనీ వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఎంతవరకూ నిజం ఉందో ఎవరికీ తెలియదు.
వివాదం వల్ల:
అయితే ఆ వివాదం వల్ల తాను డబ్బులు సరిగా ఇవ్వడూ అన్న బ్యాడ్ నేం వచ్చేసింద్దనీ... అందుకనే ఆ మార్క్ లేకుండా చూసుకోవటానికీ.., రెండోరకంగా పవన్ ఫిర్యాదుకు కౌంటర్గానే ‘నాన్నకు ప్రేమతో' డైరెక్టర్కు ప్రసాద్ లగ్జరీ కారును గిఫ్ట్గా ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు.
గత సినిమాల నష్టాన్ని పూడ్చుకోవడానికే:
‘అత్తారింటికి దారేది' సినిమాతో భారీ కలెక్షన్లు వచ్చినప్పటికీ, అవన్నీ తన గత సినిమాల నష్టాన్ని పూడ్చుకోవడానికే సరిపోయాయని, అందుకే ఆ టైమెలో పవన్ కి అనుకున్న మొత్తానికి ఇవ్వలేకపోయాడన్నీ.., అయితే ఇప్పుడు వచ్చిన లాభాలు మరీ గొప్పగా కకపోయినా సంతృప్తి కరంగానే ఉండటం తో ఈ గిఫ్ట్ నిర్ణయం తీసుకున్నాడట.
కౌంటర్ ఇవ్వడానికే :
టాలీవుడ్లో అందరితోనూ సత్సంబంధాలు కొనసాగించే బీవీఎస్ఎన్ ప్రసాద్.. పవన్ కల్యాణ్కు కౌంటర్ ఇవ్వడానికే సుక్కుకు గిఫ్ట్ ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు.
సుకుమార్ కి ప్లస్:
మొత్తానికి పవన్ కళ్యాన్ కీ నిర్మాతకూ మధ్య వివాదం సుకుమార్ కి ప్లస్ అయ్యిందన్న మాట...