Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జైబోలో తెలంగాణ చిత్రంలో ఎవరినీ కించపర్చలేదు: హీరో
జైబోలో తెలంగాణ చిత్రం ఏ ప్రాంతానికి వ్యతిరేకంగాగానీ, ఎవరి యాసను కించపరిచే విధంగాగానీ లేదని ఆ చిత్రం హీరో బాలు మంగళవారం ఓ టీవి చానల్ ముఖాముఖిలో చెప్పారు. తెలంగాణ నేపథ్యంలో చారిత్రక చిత్రాన్ని దర్శకులు ఎన్ శంకర్ తెరకెక్కించారని చెప్పారు. ఈ చిత్రాన్ని సీమాంధ్ర పాలకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చిత్రంలో ఇతర ప్రాంతాలను వ్యతిరేకిస్తూ దృశ్యాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన ఖండించారు. కాంట్రవర్సీ సృష్టించి క్యాష్ చేసుకోవాలనే దరిద్రపు గొట్టు ఆలోచనలు దర్శకుడు రాంగోపాల్ వర్మకు తప్ప ఎవరికీ రావన్నారు. శంకర్కుగానీ కాంట్రవర్సీ సృష్టించి క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదన్నారు.
హింస, అశ్లీల దృశ్యాలు ఉన్న పలు చిత్రాలకు అనుమతి ఇచ్చిన సెన్సారు బోర్డు చారిత్రక నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రాన్ని అడ్డుకోవడం చూస్తే తెలంగాణ పాలకుల కుట్రగా అర్థమవుతోందన్నారు. ఈ చిత్రంపై కేవలం తెలంగాణ ప్రాంత ప్రజల్లోనే ఆసక్తి నెలకొనలేదని, సీమాంధ్ర ప్రజలు కూడా ఈ చిత్రంపై ఆసక్తితో ఉన్నారన్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించారని ఆయన ఆంధ్రా హీరోననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. చిత్రం విడుదల తేదిని కూడా ప్రకటించామని, అయితే ఉద్దేశ్య పూర్వకంగా చిత్రం విడుదలను అడ్డుకుంటున్నారన్నారు. చిత్రం సెన్సారులో చిక్కుకోలేదని, చిక్కించారన్నారు.
కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి విద్యార్థులు జైబోలో తెలంగాణ చిత్రానికి సెన్సారు బోర్డు అడ్డు చెప్పడంతో కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లారు. కార్యాలయంలో ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. చిత్రం విడుదలను అడ్డుకోవద్దని హెచ్చరించారు. చిత్రాన్ని అడ్డుకుంటే తెలంగాణలో ఆంధ్రా హీరోల చిత్రాలు అడనివ్వమని హెచ్చరించారు.