ఇంతకీ సురేష్ బాబు చురకలు ఏ డైరక్టర్ ని ఉద్దేశించో
వెంకటేష్ తో చంద్రముఖి సీక్వెల్ ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రీమేక్ ని పి.వాసుకే అప్పచెప్పటానికి కారణం సురేష్ బాబు చెబుతూ...పి.వాసు...చక్కగా హోమ్ వర్క్ చేసుకుని సెట్ లోకి వస్తారు. అనుకున్న టైమ్ లో ఓవర్ బడ్జెట్ కాకుండా తీస్తారు..అందుకే తీసుకున్నాం అంటున్నారు. వింటానికి బాగానే ఉన్నా సురేష్ బాబు వేస్తున్న ఈ చురకలు ఎవరికనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఇక ఈ సీక్వెల్ చిత్రంలో అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అనుష్క, కమలిని ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనమ్కౌర్, రిచా గంగోపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్స్. అలాగే చనిపోయి దెయ్యంగా మారి వెంకటేష్ ని తరిమే పాత్రలో కమిలినీ ముఖర్జీ కనపడనుంది.
More from Filmibeat
వెంకటేష్ కమిలినీ ముఖర్జీ ఆప్త రక్షక అనుష్క పి వాసు kamalini mukherjee venkatesh apta rakshaka rajinikanth


Click it and Unblock the Notifications











