Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీమాంధ్రలో పోరు తెలంగాణ బ్లాక్, నారాయణమూర్తి ఫైర్
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రముఖ విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి రూపొందించిన సినిమా 'పోరు తెలంగాణ". సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదలైంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి తెలంగాణ ప్రాంతంలో సాధారణంగానే మంచి టాక్ తో ముందుకు సాగుతోంది. అయితే ఈ సినిమా సీమాంద్రలో ఒక్కటంటే ఒక్క థియేటర్లో కూడా విడుదల కాలేదు. కారణం అక్కడ ఈ సినిమా విడుదల చేయడానికి థియేటర్లే దొరకలేదు. అయితే తన సినిమాను కావాలనే ఇక్కడ విడుదల కాకుండా కొందరు సీమాంధ్ర పెట్టుబడి దారులు అడ్డకుంటున్నారని, సినిమా రంగంలో రాజకీయాలేమిటి? అంటూ మండి పడుతున్నారు దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి.
సోమవారం ఓ టీవీ ఛానల్ తో నారాయణ మూర్తి మాట్లాడుతూ....సినిమా నచ్చితే చూడాలి, నచ్చక పోతే చూడ్డం మానేయాలి, కానీ ఇలా సినిమాను అడ్డుకోవడం సంస్కారం కాదని అభిప్రాయ పడ్డారు. 69 ఉద్యమంలో దాదాపు 300 మంది మరణించారని, ఆ తర్వాత జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారని. ఈ నేపథ్యంలో అన్న అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి మనది-అందరం కలిసి ఉందా అనే కాన్నెప్టుతో తన సినిమాలో పాటను రాయించుకున్నారు. సిఃనారె రాసిన ఆ పాటను అన్ని ప్రాంతాల వారు ఆదరించారు. జై ఆంధ్ర ఉద్యమానిక సపోర్టు పలికిన హీరో కృష్ణ తన అభిప్రాయాన్ని సినిమా ద్వారా వెల్లడించారు. అప్పట్లో ఆ సినిమాలను అందరూ ఆదరించారు. వారి తరహాలోనే నేనూ ఓ కళాకారుడిగా ఒక ప్రాంతానికి జరిగిన అన్యాయాలను తన సినిమాలో చూపించాను. తన సినిమాను సీమాంద్ర పెట్టుబడి దారులు అడ్డుకోవడం ఎంత వరకు సబబు? అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర ప్రజలు ఎవరూ వ్యతిరేకించడం లేదని, కొందరు పెట్టుబడి దారులు కావాలని కృత్రిమ ఉద్యమంగా సమైక్య చేయిస్తున్నారని నారాయణ రెడ్డి అన్నారు. తాను సీమాంధ్ర ప్రాంతీయుడినే అని, అక్కడి ప్రజల మనసులో ఏముందో తనకు తెలుసన్నారు. తాను గతంలో తీసిన సినిమాలు, తీయబోయే సినిమాలు అన్యాయానికి వ్యతిరేకంగా, వాటిని వేలెత్తి చూపే విధంగా ఉంటాయని, అదే తరహాలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాన్ని తన సినిమాలో చూపించానన్నారు.