Don't Miss!
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
సూపర్ స్టార్ జీవితంలో బిగ్గెస్ట్ షాక్...ఆ హత్యే!
బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచి వేసింది. మరో వైపు ఆయన మరణం తర్వాత రాజేష్ ఖన్నాజీవితంలో ఆసక్తికర విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజేష్ ఖన్నా జీవితంలో బిగ్గెస్ట్ షాకింగ్ సంఘటన ఏమిటో తాజాగా వెల్లడైంది.
భారతీయ సినిమా రంగంలో టాప్ రేంజికి ఎదిగిన రాజేష్ ఖన్నాను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరుపున ఎంపీగా కూడా పని చేశారు. రాజీవ్ గాంధీ అంటే ఖన్నాకి అమితమైన అభిమానం. మే 21, 1991న జరిగిన రాజీవ్ గాంధీ హత్య రాజేష్ ఖన్నాను తీవ్రమైన షాక్కు గురి చేసింది. ఈ విషయాన్ని రాజేష్ ఖన్నా తన సన్నిహితులతో చెప్పేవారని ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ ప్రచురించింది.
"ప్రియమైన మిత్రులారా.. సోదరీ సోదరులారా.. జరిగిపోయినదాని గురించి బాధపడటం, జరుగుతున్నదాని గురించి చింతించడం నాకు అలవాటు లేదు. మనం ఎప్పుడూ భవిష్యత్ వైపు దృష్టి సారించాలి. కానీ, కొన్ని సందర్భాల్లో, కొందరిని కలిసినప్పుడు మాత్రం పాత జ్ఞాపకాలన్నీ తిరిగి కళ్ల ముందు కదలాడుతాయి'' అని రాజేశ్ ఖన్నా తన అభిమానులకు చివరి సందేశం ఇచ్చారు.
రాజేష్ కన్నా కోరిక మేరకు బాంద్రాలోని ఆయన బంగ్లా 'ఆశీర్వాద్'ను మ్యూజియంగా మార్చే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితుడొకరు చెప్పారు. ఐతే ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చే విషయంలో తుది నిర్ణయం ఆయన కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలే తీసుకోవాల్సి ఉంటుందన్నారు.