Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవి కంటతడి పెట్టడంపై దర్శకుడు కృష్ణ వంశీ హ్యాపీ!
హైదరాబాద్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమాలు ఫ్యామిలీ, సోసైటీ రిలేషన్ గుర్తు చేస్తూ హార్ట్కి కనెక్ట్ అయ్యి ఎమోషన్ అయ్యేలా ఉంటాయి. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడతా, సింధూరం, చక్రం లాంటి ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఎమోషన్కు గురి చేసి కంటతడి పెట్టించాయి. తాజాగా కృష్ణ వంశీ తరకెక్కిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా అలానే ఉండనుందని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసిన చిరంజీవి ఎమోషన్కు గురయి కంటతడి పెట్టారట.
ఈ విషయం గురించి దర్శకుడు కృష్ణ వంశీ మాట్లాడుతూ....‘ఇటీవలే గోవిందుడు అందరి వాడేలే చిత్రం ఫైనల్ కాపీ చిరంజీవి గారికి, సురేఖ గారికి చూపించాం. సినిమా ముగిసిన తర్వాత ఇద్దరి కళ్లలో నీళ్లు తిరగడం చూసాను. రీ రికార్డింగ్, బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి కానప్పటికీ సినిమా వారిని ఎంతగానో ఆకట్టకుంది. చిరంజీవిగా నుండి ఆ రియాక్షన్ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను' అని తెలిపారు.
ఈ మధ్య కాలంతో తెలుగు సినిమా పరిశ్రమలో యాక్షన్, కామెడీ చిత్రాల జోరు ఎక్కువైంది. అలాంటి రోటీన్ మసాలాతో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయితే అందుకు భిన్నంగా ఫ్యామిలీ రిలేషన్ షిప్స్, ఎమోషన్స్తో కూడిన ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతూ రంజింప చేస్తుందని దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం అక్టోబర్ 1న గ్రాండ్గా విడులవుతోంది. ఈచిత్రంలో రామ్ చరణ్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమిలీనీ ముఖర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.