బాధలు, ఓదార్పు: పవన్ కళ్యాణ్-మహేష్ ఫ్యాన్స్ ఇలా...!
హైదరాబాద్: మహేష్ బాబు ‘శ్రీమంతుడు' మూవీ జులై 17న విడుదల కావాల్సి ఉండగా...‘బాహుబలి' నిర్మాతల రిక్వెస్టు మేరకు సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు సినిమా చాలా ఆలస్యం అయిందని పీలవుతున్న అభిమానులు....తాజాగా మరోసారి వాయిదా పడటంతో చాలా డిస్పప్పాయింటుగా ఉన్నారు.
గతంలో హీరోయిన్ సమంతకు, మహేష్ బాబు అభిమానులకు సోషల్ మీడియాలో వివాదం ఏర్పడింది. ఆ మధ్య సమంత మహేష్ బాబును టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని మహేష్ బాబు లైట్ తీసుకున్నా, అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆ విషయం మరిచి పోలేదు. సీరియస్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాబోయే మూవీ ‘బ్రహ్మోత్సవం'లో సమంతను హీరోయిన్ గా తీసుకుంటున్నారనే విషయం తెలిసి సోషల్ మీడియాలో తన కోపాన్ని వెల్లగక్కుతున్నారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా.... మీకే కాదు, మాకు ఉన్నాయి బాధలు అంటూ గళం అందుకున్నారు. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలోని డైలాగ్ ఉపయోగించి వారు చేస్తున్న కామెంట్స్ నవ్వు పుట్టిస్తున్నాయి.
ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానులు ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ ఇలా కామెంట్ల రూపంలో ఓదార్చుకోవడం హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications