Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రియాంక చోప్రా అతన్ని తన్నింది, తర్వాత ఏడ్చింది... కారణం?
హైదరాబాద్: సినిమా షూటింగుల్లో అప్పుడప్పుడూ కొన్ని అనుకోని సంఘటనలు జరుగడం సహజమే. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో నటీనటులకు అనుకోని గాయాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో వారు అనుకోకుండా ఎదుటి వారిని గాయపరుస్తూ ఉంటారు.
ప్రయాంక చోప్రా నటిస్తున్న ‘జై గంగాజల్' సినిమా చిత్రీకరణ సమయంలోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇందులో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా తన సహచర నటుడు మానవ్ కాల్ మెడపై అనుకోకుండా తప్పింది ప్రియాంక. వాస్తవాని ఈ సీన్ చిత్రీకరణలో ఆమె అతన్ని చాతిపై ఎగిరి తన్నాలి.
కానీ అనుకోకుండా అతని మెడపై బలంగా తన్నింది. దీంతో మానవ్ కాల్ అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే ఈ సంఘటన ప్రియాంక ఒక్కసారిగా షాకయింది. తన పొరపాటు వల్లే అతడు గాయపడటంతో ప్రియాంక కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రకాష్ ఝా ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా నటించిన బాలీవుడ్ చిత్రం 'జై గంగాజల్'. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఈ చిత్రానికి స్వయంగా కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. 2003లో అజయ్ దేవగణ్ నటించిన గంగాజల్ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్గా వస్తోంది. మార్చి 4న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.