Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
షాకింగ్ న్యూస్ : 2.0 ఆలస్యానికి అసలు కారణం ఇదే.. తగ్గే ప్రసక్తి లేదంటున్న శంకర్!
Recommended Video
భారీ గ్రాఫిక్ మాయాజాలంతో వెండి తెర అద్భుతంగా 2.0 చిత్రాన్ని మలచడానికి దర్శకుడు శంకర్ ప్రయత్నిస్తున్నారు. శంకర్ సూపర్ స్టార్ రజినీతో చేసిన రోబో చిత్రం అఖండ విజయం సాధించింది. అంతకు మించేలా 2.0 చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. కానీ ఈ చిత్రం గత ఏడాదే విడుదల కావలసి ఉంది. ఆ తరువాత జనవరిలో అని వార్తలు వచ్చాయి. ఇటీవల ఏప్రిల్ 27 న విడుదల అంటూ ప్రకటించారు. తాజా పరిస్థితుల ప్రకారం ఈ చిత్రం వేసవిలో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
వరుసగా వాయిదాలు
ప్రతిష్టాత్మకంగా శంకర్ 2.0 చిత్రాన్ని ప్రారంభించారు. విజువల్స్ ప్రధానాంశం ఐన చిత్రంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులేఎక్కువగా ఉంటాయి. గ్రాఫిక్స్ పక్కాగా అనుకున్న విధంగా రాబట్టాలి. దీనితో 2.0 చిత్రం గత ఏడాది దీపావళి నుంచి వరుసగా వాయిదా పడుతూ వస్తోంది.
కనివిని ఎరుగని రీతిలో
2.0 చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అందాల భామ అమీ జాక్సన్ నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండడం విశేషం.
షాకింగ్ రీజన్
అసలు 2.0 చిత్రం ఇంతలా వాయిదా పడడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అని మీడియాలో, సినీవర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా వీస్తున్న వార్తలు షాక్ కి గురి చేసేలా ఉన్నాయి. 2.0 చిత్ర యూనిట్ వి ఎఫ్ ఎక్స్ పనులని ఓ విదేశీ సంస్థకు అప్పగించిందట. కానీ ఆ సంస్థ పనులని సకాలంలో పూర్తి చేయకుండా వాయిదా వేస్తూ వచ్చింది. ఇటీవల తమ సంస్థ దివాళా తీసిందని సదరు కంపెనీ ప్రకటించుకోవడంతో 2.0 చిత్ర యూనిట్ షాక్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
రాజీపడే ప్రసక్తి లేదంటున్న శంకర్
దర్శకుడు శంకర్ మాత్రం గ్రాఫిక్స్, సినిమా క్వాలిటీ విషయంలో రాజి పడే ప్రసక్తి లేదని చిత్ర యూనిట్ కు తేల్చి చెప్పాడట. మరో సంస్థల గ్రాఫిక్స్ వర్క్ ని అప్ప గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరో మారు వాయిదా
గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కానీ నేపథ్యంలో మరో మరు ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వి ఎఫ్ ఎక్స్ పనులు ఓ కొలిక్కి వచ్చాక కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు.