Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్యపై కోపంతోనే అక్కినేని ఫ్యామిలీ రాలేదా?
హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుడు నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖంలా హాజరయ్యారు. బాలయ్య తన రేంజికి ఏ మాత్రం తగ్గకుండా ఏర్పాట్లు చేసి అదరగొట్టారు.
ఈ వేడుకకు బాలయ్య సోదరుడు నందమూరి హరికృష్ణ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. వీరు రాక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫ్యామిలీ గొడవలే అందుకు కారణం. అయితే అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా బాలయ్య కూతురు పెళ్లికి ఎవరూ కూడా రాకపోవడం ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది.
నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి ముంబై బ్యాడ్మింటన్ లీగ్లో ఉన్నారు కాబట్టి రాలేదని అనుకున్నా....కనీసం అక్కినేని నాగేశ్వరరావు కూడా ఎందుకు హాజరు కాలేదు? వారి ఫ్యామిలీలోని ఇతర హీరోలు ఒక్కరైనా ఈ వివాహం వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఫిల్మ్ నగర్ నుండి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం....నాగార్జున, బాలకృష్ణ మధ్య ఓ విషయంలో ఏర్పడ్డ విబేధాల వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. గతంలో నాగార్జున ఓ అవసరం నిమిత్తం బాలయ్యను సంప్రదించాడని, అయితే బాలయ్య ఎలాంటి సహకారం అందించలేదని, దీంతో నాగార్జున అప్పటి నుంచి బాలయ్యపై కోపగా ఉన్నాడని, ఆయనతో మాట్లాడటం లేదని...ఆ కారణంగానే అక్కినేని ఫ్యామిలీ బాలయ్య కూతురు కళ్యాణ మహోత్సవానికి గైర్హాజరు అయ్యారని అంటున్నారు.