Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
కాంప్రమైజ్ కానని పూరీకి చెప్పేశాను: బాలకృష్ణ
పూరి జగన్నాథ్ కథ నచ్చకపోవడంతో నేను కాంప్రమైజ్ కానని ఆయనకు చెప్పేశాను. కథ ముఖ్యమండి. దాని తర్వాతే నిర్మాత. పూరీ జగన్నాధ్ కథ ఓ.కే అయితే ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభించి, విజయదశమికి సినిమాని విడుదల చెయ్యాలనుకున్నాం అంటున్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఓ చిత్రం ప్లాన్ చేసిన సంగతి తెలిసింది. ఆ విషయం ప్రస్దావిస్తూ బాలకృష్ణ..నిర్మాతల గురించి కూడా మాట్లాడారు. ఆయన మాటల్లోనే...షూటింగ్ లో జరిగే ప్రతి విషయం నిర్మాతకు తెలియాలి. కొందరు దర్శకులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ వాళ్ల మనుషులే అంతా ఉండాలని చెప్పి నిర్మాతను అనామకుణ్ని చేసేస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. సమస్య ఎక్కడ వస్తోందంటే అనుకున్న సమయానికి సినిమాలు పూర్తి కాకపోవడం వల్లే. కొన్ని సినిమాలు పూర్తి కావడానికి రెండేళ్లు మూడేళ్లు పడుతోందని వింటున్నాం. అలా ఎందుకు జరుగుతోందో అర్ధం కావడం లేదు. నిర్మాతకు అవగాహన, సినిమా మీద కంట్రోలు లేకపోవడమే దీనికి కారణం అని చెప్పారు. ఇక పూరీ జగన్నాధ్ రెండు కథలు..బాలకృష్ణకు చెప్పారని, టైటిల్ గా అనుచరుడు అని చెప్పేడని తెలుస్తోంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ లేవని బాలకృష్ణ రిజెక్టు చేసారని సమాచారం.