Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న దిల్ రాజు: కారణం ఆలోచించదగ్గదే
శంకర్, కమల్హాసన్ కాంబినేషన్లో ప్లాన్ చేసిన భారతీయుడు 2 మీద అంత భారీ బడ్జెట్ ఆ కాంబినేషన్ తో ఇప్పటి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవటమే అవుతుందని ఆ ప్రాజెక్ట్ నుంచు తప్పుకున్నారట దిల్ రాజు
ఇన్నాళ్లు 30 నుండి 50 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టి సినిమాలు తీస్తూ చిన్న సినిమాలతోనే పెద్ద రికార్డులు కొట్టిన దిల్ రాజు 180 కోట్ల బడ్జెట్ తో భారతీయుడు ప్రాజెక్ట్ చేయటానికి పూనుకున్నాడు అనగానే. అంతా ఆసక్తిగా చూసారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం సంచలనాలు సృష్టించిన ఆ సినిమా సీక్వల్ గా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కాని అది కుదరలేదు. ఫైనల్ గా భారతీయుడు-2కు రంగం సిద్ధమైంది. తెలుగు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆ సినిమా నిర్మిస్తున్నారని అఫిషియల్ గా చెప్పేశారు. 180 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తన కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా తీయటానికి ఒప్పుకున్నాడు దిల్ రాజు.
భారతీయుడు
1996లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం ‘భారతీయుడు'. అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. కమల్ హాసన్కు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది. ఉత్తమ నటుడు విభాగంలో జాతీయ పురస్కారాన్ని సైతం అందుకున్నారు.
భారతీయుడు 2
అయితే చాలా కాలంగా ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. భారతీయుడు చిత్రాన్ని నిర్మించిన ఏఎమ్ రత్నం కూడా గతంలో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని వెల్లడించారు. అయితే చాలాకాలం గడిచిపోయింది. ఇక ఆ రెండో పార్ట్ సంగతే అంతా మర్చిపోయాక మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ని తెరమీదకి తెచ్చే ప్రయత్నాలని మొదలు పెట్టారు. అందులో భాగంగానే దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నిర్మాతగా మారాడు..
దిల్ రాజు తప్పుకున్నట్టు వార్తలు
అయితే సడెన్ గా ఏమయ్యిందో ఏమో గానీ అయితే తాజాగా ఆ సినిమా నుంచి దిల్ రాజు తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. శంకర్, కమల్హాసన్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఇప్పట్లో సినిమా తీయడం మంచి ఆలోచన కాదని భావించడం వల్లే ఆ సినిమా నుంచి దిల్ రాజు తప్పుకున్నారట.
లైకా ప్రొడక్షన్స్
శంకర్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న `రోబో 2.0`ను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. దిల్ రాజు తప్పుకోవడంతో `భారతీయుడు-2`ను కూడా ఆ సంస్థే నిర్మిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ విశయాన్ని అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. మరి అటు శంకర్ గానీ, ఇటు దిల్ రాజు గానీ ఈ విషయాన్ని చెప్పేదాక అసలు కారణాలేమిటన్నది తెలిసే అవకాశం లేదు మరి..