Don't Miss!
- News మంగళగిరిలో దుమ్మురేపిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కాజల్ ని చండిలో కాదన్న అసలు కారణం!?
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఎమ్.ఎస్.రాజు నిర్మించతలపెట్టిన చండి చిత్రంలో కాజల్ ని ఎంపిక చేసిన సంగితి తెలిసిందే. అయితే ఈ మద్య ఆమెను రెమ్యునేషన్ ఎక్కువ అడిగిందని తీసేసారంటు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ఎమ్.ఎస్.రాజు సమాధానంగా...చండి చిత్రం కోసం సంవత్సరం పాటు డేట్స్ కావాలి. అలాంటి హీరోయిన్ మాత్రమే నా చిత్రంలో చేస్తుంది. బిజీగా...హడావిడిగా ఉండే వాళ్ళు ఈ ప్రాజెక్టులో కష్టం అని తేల్చేసారు. ఇక రెమ్యునేషన్స్ కట్ అంటూ ఇండస్ట్రీలో సాగుతున్న విషయం గురించి ఆయన ప్రస్ధావిస్తూ...నేను లావిష్ గా చిత్రాలు తెరకెక్కిస్తూంటాను. కానీ ఎప్పుడూ ప్యాన్సీ రేటుకు ఎవర్నీ తీసుకోలేదు. నేను దర్శకులకైనా, స్టార్స్ కైనా మార్కెట్ లో ఉన్న వ్యాల్యూ ని బట్టే రెమ్యునేషన్ నిర్ణయిస్తాను. నా చిత్రం కోసం ఎక్కువ డేట్స్ అడుగుతాను..గ్రాండ్ గా చిత్రీకరిస్తాను అన్నారు. ఇక ఇరవై అయిదు కోట్ల పెట్టుబడితో చేసే సినిమాల్లో మినిమం అరవై పర్శంట్ బడ్జెట్ రెమ్యునేషన్స్ కే పోతోందని, దీనిపై చర్య తీసుకోవాలి నిర్మాతల మండలి గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతోంది. దిల్ రాజు అద్యక్ష్యతన ఓ కమిటీ వేసింది.