రామ్ చరణ్, దాసరి కోల్డ్ వార్ ఎందుకు?
రామ్ చరణ్, దాసరి నారాయణరావుల మద్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్,మాటల యుధ్దం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ గొడవకు మూలం నంది అవార్డుల సమయంలో మొదలైందని తేల్చారు. అప్పుడు దాసరి మేస్త్రి సినిమా అవార్డులను కొట్టుకుపోయింది. రామ్ చరణ్ తనకు మగధీరతో వస్తుందనుకున్న అవార్డుని సైతం ఆయన పట్టుకెళ్ళిపోయారు. అప్పుటి నుంచి రామ్ చరణ్ తనుకు అవకాశమున్నప్పుడల్లా దాసరి పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తనకు సంభంధం లేని హీరోయిన్స్ కామెంట్ విషయంలోనూ ట్వీట్ చేసి దాన్ని వేడిక్కించారు.అలా దాసరి ని కదిపి వివాదాల పుట్టలో వేలు పెట్టి కొనసాగిస్తున్నారు.అయితే దాసరి తనను అంటున్నారు అని రెచ్చిపోతే...రామ్ చరణ్ మాత్రం ఆరెంజ్ ప్లాప్ నుంచి తనను తాను జనం గుర్తించుకునేందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నాడంటున్నారు. ఏదైమైనా ఈ కోల్డ్ వార్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో కానీ ఇండస్ట్రీలోని లుకలుకలన్ని దాసరి బయటపెట్టేడట్లున్నాడంటున్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











