Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
శృతి హాసన్ ..ఎన్టీఆర్ కి బై చెప్పటానికి కారణం?
శృతి హాసన్ తాజాగా ఎన్టీఆర్ దమ్ము చిత్రం నుండి బయిటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆమె మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ... శృతి ఈ చిత్రానికి మార్చి లో డేట్స్ ఇచ్చింది. నవంబర్ కి కంప్లీట్ అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు షెడ్యూల్ మారింది. ఈ చిత్రం షూటింగ్ కేవలం రెండు వారాల క్రితమే మొదలైంది అన్నారు. ఇక శృతి ఈ ప్రాజెక్టునుండి బయిటకు రావటానికి బయిట రకరకాల కారణాలు వినపడుతున్నాయి. అయితే కేవలం డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటమే ఈ ప్రాజెక్టుకి బై చెప్పటానికి కారణమని ఈ విధంగా స్పష్టం చేసారు. అయితే ఆమె వాలంటరిగా టీమ్ కి గుడ్ లక్ చెప్పి బయిటకు వెళ్లటంతో ఈ మ్యాటర్ ఇష్యా కాలేదు. ఇప్పుడు ఆమె ప్లేసులోకి ఎవరిని తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. కాజల్ నే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. కాజల్ గతంలో ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో చేసింది.అలాగే సెకెండ్ హీరోయిన్ గా హన్సిక,కార్తిక రేసులో ఉన్నారు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని, ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.