Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
జనం దండిగా రావాలనే బాలయ్య ప్లాన్?
నందమూరి బాలకృష్ణ-బాపు కాంబినేషన్లో వచ్చిన పౌరాణిక చిత్రం 'శ్రీరామ రాజ్యం' 50 రోజుల దిశగా దూసుకెలుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకను విజయవాడలో జనవరి 5న ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు కూడా. అయితే విజయవాడలోనే ఈ సినిమా 50 రోజుల వేడుక ఎందుకు ప్లాన్ చేస్తున్నారు? హైదరాబాద్, వైజాగ్ లాంటి పెద్ద సిటీలు ఉన్నాయి కదా... అని చాలా మంది సందేహ పడుతున్నారు.
అయితే సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం..... ఈ వేడుకకు జనం తండోపతండాలుగా తరలి రావాలనే ప్లాన్ తోనే బాలయ్య, సినిమా దర్శక నిర్మాతలు ఈ ఫంక్షన్ విజయవాడలో డిసైడ్ చేశారని అంటున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన దూకుడు 50 రోజుల వేడుకకు ఫుల్లుగా జనం తరలి వచ్చారు. గతంలో చిరంజీవి ఇంద్ర సినిమా 175 రోజుల సెలబ్రేషన్స్ కు అప్పట్లో ఏకంగా 8 లక్షల మంది తరలి వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచారు.
నందమూరి కుటుంబానికి, ముఖ్యంగా బాలయ్యకు కృష్ణ జిల్లాలో ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరే జిల్లాలోనూ లేదు. నందమూరి కుటుంబీల స్వస్థలం నిమ్మకూరు ఇదే జిల్లాలో ఉంది. ఈ నేపథ్యంలో బెజవాడలో 50 రోజుల వేడుక ఏర్పాటు చేస్తే.....తన స్టార్ హోదాకు తగిన విధంగా అభిమానులు తరలివస్తారు. ఒక వేళ వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే జనాలు రాక పోతే పరువు పోతుందని, అలా జరుగకుండా ఉండాలంటే బెజవాడే బెస్ట్ అని చివరగా నిర్ణయానికి వచ్చి ఏర్పాట్లు మొదల పెట్టారు.