Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎక్కడ చూసినా బాలయ్య శ్రీరామ రాజ్యం స్మరణే
ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో ఈ రోజు బాలయ్య రోజుగా అభివర్ణిస్తున్నారు సినీ అభిమానులు, సినీ వర్గాలు. మరి ఆ రేంజ్ లో ఉంది శ్రీరామ రాజ్యం సినిమా సందడి. నందమూరి బాలకృష్ణ లార్డ్ రామా గా నటించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై తెలుగువారు వారు ఉన్న ప్రతి ప్రాంతంలో సందడి చేస్తోంది. ఈ సినిమా పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ఈ జనరేషన్లో ఎక్కవుగా వస్తున్న బూతు సినిమాలు ఇష్ట పడని భక్తిరస ప్రియులు, ఆధ్యాత్మిక వాదులు కూడా శ్రీరామ రాజ్యం సినిమా చూసేందుకు థియేట్లర్ల వైపు నడుస్తున్నారు.
ఇక బాలయ్య అభిమానుల సందడి ఇంత అంత కాదు. సినిమా విడుదల సందర్భంగా అభిమానులు హైదరాబాద్ లోని శాంతి థియేటర్ వద్ద వినూత్న ప్రదర్శన నిర్వహించారు. పైరసీని ప్రోత్సహించ వద్దని, అలాంటి ప్రేక్షకులు ఎక్కడైనా గమనిస్తే తమ సమాచారం ఇవ్వాలని వినూత్న ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు జరిగాయి.
ఈ రోజు సినిమా మార్నింగ్ షో రిలీజైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని, సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని బాలయ్య అభిమానులు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ఓ అబిమాని ప్రిమియర్ షో టికెట్ ను 5వేల డాలర్లు(దాదాపు రెండున్నర లక్షల రూపాయలు)ఖర్చు చేసి కొనడం కూడా తెలుగు సినీ చరిత్రలో రికార్డుగా మిగిలి పోయింది.
మరో వైపు సినిమా విడుదలను పురస్కరించుకుని బాలయ్య అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోవడం కూడా మీడియాలో చర్చీనీయాంశం అయింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుంతా ఎక్కడ చూసినా బాలయ్య శ్రీరామ రాజ్యం సినిమా స్మరణతో సందడిగా మారింది.
ఈ సినిమాలో సీత పాత్రను నయనతార పోషించగా, వాల్మీకి మహర్షి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మణుడి పాత్రలో శ్రీకాంత్ నటించారు. ఇళయరాజ సంగీతం అందించారు. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రమణ రచయితగా పని చేశారు. బాపు-రమణ సినిమా కావడం, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలయ్య హీరో కావడంతో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా ఉండటంతో సినిమా విజయం దిశగా సాగుతుందనే ప్రచారం సాగుతోంది.