twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యారాయ్‌ పోటీ అక్కడ నుంచా?

    By Staff
    |

    Aishwarya Rai
    లక్నో నుంచి సంజయ్‌దత్‌ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ ఇప్పుడు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌నూ రాజకీయాల్లోకి దించే ప్రయత్నంలో ఉంది. ఐశ్వర్యను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున బీహార్‌లోని మథేపురా నియోజకవర్గం నుంచి రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మథేపురాలో జనతాదళ్‌(యు) అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌పై ఐశ్వర్యారాయ్‌ని పోటీకి పెట్టాలని పార్టీ యోచిస్తోంది. ఇందు నిమిత్తం ఎస్పీ బీహార్‌ పార్లమెంటరీ బోర్డు ఐశ్వర్య పేరును పార్టీ నేత ములాయాం సింగ్‌ యాదవ్‌కు సిఫార్సు చేసింది.

    ఆ సిఫార్స్ లేఖలో బీహార్‌లోని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆమె నిలబడటాన్ని కోరుకుంటున్నారని తెలిపాడు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో మథేపురాలో శరద్‌యాదవ్‌పై రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, చాప్రా నియోజకవర్గంలోనూ పోటీ చేసిన లాలూ ఈ స్థానాన్ని అట్టేపెట్టుకుని మథేపురాకు రాజీనామా చేశారు. ఇక్కడ వెనుకబడిన యాదవ కులస్తులే ఎక్కువగా ఉన్నారు. మరి అటువంటి చోట ఐశ్వర్య నెగ్గుకు రాగలదా అన్నది అందరూ ఆలోచనలో పడుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X