Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఖచ్చితంగా ఆ సీక్వెల్ లో నటిస్తా: శ్రీదేవి
శ్రీదేవి మాట్లాడుతూ... 'మిస్టర్ ఇండియా-2లో కూడా నేను తప్పక నటిస్తా. అయితే దాని గురించి ఇంత ముందుగా మాట్లాడుకోవడం సరికాదు. సినిమాలో నా పాత్ర ఏంటనేది కూడా నేను ఇప్పడు చెప్పలేను. నా భర్త బోనీకపూర్ ప్రస్తుతం 'నో ఎంట్రీ మే ఎంట్రీ' షూటింగ్ను ప్రారంభించే పనిలో ఉన్నారు. అది పూర్తయిన తర్వాతే మిస్టర్ ఇండియా-2 గురించి ఆయన ప్రకటిస్తారు. అప్పుడు మాట్లాడుకుందామ'ని చెప్పింది. కొత్త దర్శకురాలు గౌరీ షిండేతో ఇంగ్లిష్ వింగ్లిష్లో నటించారు.. ఎలా అనిపించింది..? అని అడిగిన ప్రశ్నకు శ్రీదేవి సమాధానిమిస్తూ... మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రంతో మళ్లీ బాలీవుడ్లోకి అడుగుపెట్టడడం గర్వంగా ఉందని చెప్పింది.
" శ్రీదేవి లేకుండా నేను మిస్టర్ ఇండియా సీక్వెల్ ని ఊహించలేను. ఎందుకంటే నేను మిస్టర్ ఇండియా సమయంలోనే ఆమెతో ప్రేమలో పడ్డాను. తర్వాత నా ప్రేమను ఆమె ఒప్పుకోవటానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఎమోషనల్ గా నాకు ఆ సినిమాతో బాగా అనుభందం ఉంది. కాబట్టి మిస్టర్ ఇండియా సీక్వెల్ లో శ్రీదేవి గెస్ట్ రోల్ చేస్తుంది. ఆమె లేకుండా నేను సినిమా చేయను," అని తేల్చి చెప్పారు బోనీ కపూర్.
దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన 'మిస్టర్ ఇండియా' హిందీ చిత్రం అప్పట్లో ఓ సంచలనం. అనిల్కపూర్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం భారీ స్థాయిలో పెద్ద హిట్టయింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ నిర్మించడానికి నిర్మాత బోనీకపూర్ (శ్రీదేవి భర్త) సన్నాహాలు చేస్తున్నాడు. మొదట్లో మరో దర్శకుడిని తీసుకుందామని ఆయన ఆలోచించినప్పటికీ, తర్వాత మనసు మార్చుకుని ఒరిజినల్ తీసిన శేఖర్కపూర్నే దీనికి దర్శకుడిగా నియమించుకున్నాడు. కాగా, ఒక యవ జంట ప్రధాన పాత్రలు పోషించే ఈ 'మిస్టర్ ఇండియా-2'లో అనిల్, శ్రీదేవి జంట కూడా కీ రోల్స్ లో కనిపిస్తారు. పాత్రల్లో కనిపిస్తారు.
మరో ప్రక్క 'మిస్టర్ ఇండియా' చిత్రాన్ని ఇప్పుడు త్రీడీలోకి మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే త్రీడీలోకి మార్చే వ్యవహారాలపై చర్చలు సాగిస్తున్నట్లు బోనీ స్పష్టం చేశారు. బహుశా వచ్చే ఏడాది మే నుంచి త్రీడీ పనులు మొదలుపెట్టి 2014లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఆ తరవాతే రెండో భాగాన్ని రూపొందిస్తామని బోనీ తెలిపారు.