Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ మ్యాజిక్ వర్కవుట్ అవుతుందా? 120 కోట్ల మాటేంటి!
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం స్పైడర్. భారీ అంచనాలతో ఈ నెల 27న విడుదలవుతున్న ‘స్పైడర్‘ పై అటు చిత్ర పరిశ్రమ వర్గాలు...
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం స్పైడర్. భారీ అంచనాలతో ఈ నెల 27న విడుదలవుతున్న 'స్పైడర్' పై అటు చిత్ర పరిశ్రమ వర్గాలు... ఇటు ప్రిన్స్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే భారీ వ్యయంతో నిర్మించిన స్పైడర్ చిత్రం మహేష్ బాబు తన సినిమా కెరీర్ లోనే అత్యధికంగా పలు థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా ఇప్పటికే ఓ రికార్డు సష్టించింది.
రూ. 120 కోట్లు వచ్చేనా...
మహేష్, దర్శకుడు మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ స్పైడర్ చిత్రం రిలీజ్ కు ముందే రూ. 150 కోట్లు పలు రకాలుగా బిజినెస్ చేసింది. థియేటర్ హక్కుల రూపంలో రూ. 120 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. మిగతా మొత్తం శాటిలైట్, మ్యూజిక్ హక్కుల రూపంలో బిజినెస్ జరిగినట్లు సమాచారం.
సినిమా హక్కులు ఆ సంస్థలకే...
స్పైడర్ చిత్రానికి సంబంధించిన ఓవర్ సీస్ హక్కులను అట్మస్, ఎజడ్ అనే సంస్థలు దక్కించుకున్నాయి. స్పైడర్ కు వస్తున్న క్రేజ్ ను పరిగణలోకి తీసుకుని దక్షిణ భారతంలో రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో అత్యధిక ప్రింట్లను రిలీజ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఒక్క యూఎస్ లోనే....
సౌత్ ఇండియాలో భారీగా రిలీజ్ చేస్తునే అదే మొత్తంలో యూఎస్ లో కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... అమెరికాలో తెలుగు, తమిళ భాషల్లో కలిపి 600 పైగా స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దసరా కానుకగా వస్తున్న ఈ చిత్ర నిర్మాణానికి మహేష్ తన సినిమా కెరీర్ లోనే అతి భారీగా ఖర్చు పెట్టినట్లు సమాచారం.
ఐబీ అఫీసర్ గా మహేశ్...
దర్శకుడు ఏ ఆర్ మురగదాస్ డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ ఇంటిలిజెన్స్ బ్యూరో అఫీసర్ గా నటిస్తున్నారు. మహేష్ సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన టిజర్లు ఫస్ట్ లుక్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చెన్నైలో ఇటీవల రిలీజ్ అయిన ఆడియోకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న రిలీజ్ కు సిద్ధమైన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.