Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సాహో ఎఫెక్ట్: ఎవరి మాట వినని ప్రభాస్.. నచ్చ జెప్పేందుకు ఆ ఇద్దరు!
తెలుగు సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సాహో చిత్రం రిలీజ్కు ముందు దేశవ్యాప్తంగా ఎంత చర్చ జరిగిందో.. విడుదల తర్వాత ప్రతికూల, అనుకూల వార్తలతో అంతే చర్చ జరిగింది. ఓ పక్క సినిమా గురించి అనేక రకాలు కథనాలు వస్తుండటం, భారీగా కలెక్షన్లు సాధిస్తున్న సమయంలో చిత్ర యూనిట్ పెద్దగా స్పందించకపోవడం పలు అనుమానాలకు తెరలేపింది. అయితే ప్రభాస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై సినీ వర్గాల్లో భారీగా చర్చ జరిగింది. ప్రమోషన్ చేపట్టకపోవడంలో ఏం జరిగిందంటే..
350 కోట్ల వసూళ్లతో
సాహో చిత్రంపై భారీగా ప్రతికూల రివ్యూలు, అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటి అన్నింటిని ఎదురించి సాహో రికార్డు కలెక్షన్లు సాధించింది. దేశవ్యాప్తంగా ప్రభాస్కు ఉన్న క్రేజేంటో అర్ధమైంది. దేశవ్యాప్తంగా సాహో మూవీ రూ.350 కోట్లకుపైగానే వసూలు చేసింది. కానీ ప్రభాస్ ఆ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించలేదనే మాట వినిపించింది.
సీక్రెట్ ప్లేస్కు ప్రభాస్
వాస్తవానికి ప్రతీ సినిమా రిలీజ్కు ముందు ప్రభాస్ ఏకాంతంగా గడపడటం అలవాటు అని సీనియర్ నటుడు కృష్ణం రాజు భార్య ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. సాహో రిలీజ్కు ముందు కూడా ప్రభాస్ ఓ సీక్రెట్ ప్లేస్కు వెళ్లి విశ్రాంతి తీసుకొన్నారని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. సాహోకు ముందు భారీగా, రాత్రింబవళ్లు ప్రమోషన్ చేసిన సంగతి తెలిసిందే.
పోస్ట్ రిలీజ్ ప్రమోషన్కు దూరంగా
సాహాకు రిలీజ్ తర్వాత కూడా వసూళ్లు సానుకూలంగా ఉండటంతో ప్రభాస్తో ప్రమోషన్ చేయించాలని భావించారు చిత్ర యూనిట్. అయితే ప్రభాస్ ప్రచారం చేస్తే వసూళ్లు తగ్గకుండా ఉంటాయని భావించారు. అయితే సినిమా ఫలితం మరోలా ఉండటంతో ప్రభాస్ డిజపాయింట్ అయ్యారని, అందుకే ఆయన పోస్టు రిలీజ్ ప్రమోషన్కు దూరంగా ఉన్నారనే మాట వినిపిస్తున్నది. అయితే పలువురు నచ్చ చెప్పినప్పటికీ వినలేదనే ప్రచారం జరుగుతున్నది.
రంగంలోకి యూవీ క్రియేషన్స్
గత రెండు రోజులుగా సాహో కలెక్షన్లు క్షీణిస్తుండటంతో ప్రభాస్ను ప్రమోషన్కు రప్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు యూవీ క్రియేషన్స్కు చెందిన ప్రమోద్, వంశీ రంగంలోకి దిగినట్టు సమాచారం. ప్రభాస్కు నచ్చచెప్పడం వల్లే హైదరాబాద్కు తిరిగి వచ్చారనే ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రమోద్, వంశీ మాట విని ప్రభాస్ రంగంలోకి దూకితే డిస్టిబ్యూటర్లకు నష్టాలను భారీగా తగ్గించడానికి అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తున్నది.