Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘రేసు గుర్రం’ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం: సురేందర్ రెడ్డి
హైదరాబాద్: కిక్ సినిమాకు సీక్వెల్ గా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘కిక్-2' ఇటీవల విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించిన ఫలితాలను రాబట్టలేదు. మిక్డ్స్ రివ్యూలు, మిక్డ్స్ టాక్ వల్ల సినిమా కాస్త డీలా పడింది. అయితే ఈ సినిమా ఫలితం తనకు సంతృప్తిని ఇచ్చిందని అంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. త్వరలో ‘రేసు గుర్రం' చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్లు ప్రకటించారు.
‘అల్లు అర్జున్తో ‘రేసుగుర్రం 2' చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. దీంతో పాటు కిక్-3 చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ సినిమాలకు స్టోరీ డిఫరెంటుగా ఉంటుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతాయని ఆశిస్తున్నట్లు సురేందర్ రెడ్డి వెల్లడించారు. ‘రేసు గుర్రం' చిత్రం 2014లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
‘కిక్-2' సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి వెల్లడిస్తూ...‘ఆడియన్స్ కిక్-2 సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రివ్యూలు ఎలా ఉన్న స్పందన బావుంది. ఓపెనింగ్ వీకెండ్ లో వసూళ్లు బావున్నాయి' అన్నారు.
‘కిక్-2' సినిమా ఓపెనింగ్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 21.45 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.