Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
త్రిష వారిని మించి పోతోందా?
హీరోయిన్ త్రిష ఈ సంక్రాంతికి బాడీగార్డు సినిమా ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం విడుదలవుతున్న ఆమె మొదటి సినిమా కావడంతో విడుదలపై చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఈ చిత్రంలో తనది కేవలం గ్లామర్ పాత్ర మాత్రమే కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో ప్రేక్షకుల స్పందన ఎలాంటి ఉంటుందో అనే దానిపై చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
వెంకీతో త్రిష జతకట్టడం ఇది మూడోసారి. గతంలో 'ఆడవారి మాటలకు అర్థాలే' చిత్రంలో వెంకీతో నటించి మంచి మార్కులు కొట్టేసిన త్రిష, ఆతర్వాత నమో వెంకటేశ చిత్రంలో నటించింది. మూడో సారి తమ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చాలా ఆశలు పెట్టుకుంది. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా తన కెరీర్లోనే ఈ సినిమా బెస్ట్ పెర్ఫార్మెన్స్ సినిమాగా నిలుస్తుందని చెప్పుకొచ్చింది.
త్రిష మాటలు చూస్తుంటే...బాడీగార్డ్ మలయాళ, తమిళ, హిందీ వెర్షన్లలో నటించిన నయనతార, అసిన్, కరీనా కపూర్ లను మించి పోతుందా? అనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. మరి ఇందులో వాస్తవం ఎంత? అనేది ఈ నెల 14న విడుదల కాబోతున్న బాడీగార్డ్ చూస్తే తెలిసిపోతుంది.
వెంకటేష్-త్రిష జంటగా రూపొందిన ఈచిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించారు. బెల్లకొండ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.