Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మోహన్ బాబూ..నీ బద్మాష్ మాటలు బంద్ చేయి
మోహన్ బాబు బద్మాష్ మాటలు బంద్ చేయి, తెలంగాణ ఆత్మాభిమానాలను గౌరవించేలా మాట్లాడు, తెలంగాణకు ఎవరువ్యతిరేకంగా మాట్లాడినా మహిళలు తరిమికొడతారని ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఆమె సోమవారం లక్సెట్టిపేట జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ధూంధాం కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ప్రముఖ సినీ నటుడు మోహన్బాబుని ఉద్దేశించి ఆమె పై విధంగా మాట్లాడారు.
అలాగే మోహన్ బాబు మాట్లాడిన మాటలు మహిళలను కిం చపరిచే విధంగా చేతులకు గాజులు తొడుకున్నామా అంటే మహిళలు అంత చులకనా, తెలంగాణ మహిళ ఐలమ్మ రజాకారులను తరిమికొట్టిందని గుర్తుంచుకోవాలని తెలిపారామె. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మహిళా లోకం తరిమికొడుతామన్నారు.పల్లె పల్లెన తెలంగాణ అంటుకున్నదంటూ ఉద్వేగంగా అన్నారు.
మన 10 జిల్లాల్లో 19 మంది ఎంపీలు రాజీనామా చేస్తే యూపీఏ సర్కార్ కూలుతుందని తెలంగాణ ఏర్పాటుఅవుతుందని, ఏదో తేల్చుకోవాలని నాయకులకు సవాల్ విసిరింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో ధూంధాం కళాకారులు, జేఏసీ నాయకులు, అన్ని కులసంఘాలు, మహిళలు పాల్గొన్నారు.