Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎప్పుడూ కత్తిని వెంట తీసుకెళ్లండి:శిల్పాషెట్టి
పోలీసులు మాత్రం ఎంతనిచేస్తారు....వారిపై మోయలేని భారాన్ని మోపడం ఎందుకు. మనమే జాగ్రత్త పడాలన్నారు. అందుకే, మహిళలు తమను తాము రక్షించుకునేందుకు కత్తిని వెంట తీసుకెళ్లాల్సిందేనని శిల్పాషెట్టి పునరుద్ఘాటించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
ఇక కామన్వెల్త్ క్రీడల అవినీతి కుంభకోణానికి సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులు నటి శిల్పాశెట్టికి రూ.71.73 లక్షలు చెల్లించినట్లు ఢిల్లీ కోర్టు తెలిపింది. 2008లో కామన్వెల్త్ యువజన క్రీడల ముగింపు వేడుకలో శిల్పాశెట్టి ఒక ప్రదర్శన చేశారు. దానికి గాను కల్మాడీ సూచనల మేరకు పీడీ ఆర్య, ఏకే మదన్ అనే ఇద్దరు ఆమెకు రూ.71.73 లక్షలు చెల్లించారు. వీరిద్దరూ 2010లో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో నిందితులు. కామన్వెల్త్ క్రీడల(సీడబ్ల్యూజీ) నిర్వహణ కమిటీ బహిష్కృత అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ, మరో 9 మందిపై కోర్టులో విచారణకు రంగం సిద్ధమైంది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో గరిష్ఠంగా జీవితఖైదు శిక్షపడే అవకాశం గల కుట్ర, దొంగ సంతకం తదితర ఆరోపణలపై ఢిల్లీ కోర్టు సోమవారం కల్మాడీ, ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యదర్శి లలిత్ భానోత్ సహా 9 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. నిందితులు ప్రభుత్వానికి రూ.90 కోట్లు నష్టం కలిగించారన్న ఆరోపణలపై భారత శిక్షాస్మృతిననుసరించీ, అవినీతి నిరోధక చట్టం కింద ఈ అభియోగాలు ఉన్నాయి.
కుంద్రాకు బెట్టింగుతో సంబంధం ఉన్నప్పటికీ స్పాట్ ఫిక్సింగ్తో మాత్రం సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కుంద్రాను మరోసారి విచారణకు పిలుస్తామని కూడా పోలీసులు అంటున్నారు. కుంద్రా సహ యజమానిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయిన విషయం తెలిసిందే.