Don't Miss!
- News టీడీపీ హ్యాట్రిక్ కు వైసీపీ యువనేత బ్రేకులు వేస్తారా..!!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
యువహీరోకు విలన్ గా నటించబోతున్న రైటర్ అబ్బూరి రవి!
యువ హీరో ఆది ఈ మద్య చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ప్రస్తుతం విశ్వనాథ్ ఆరిగేల అనే కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. సమ్మర్ లో రిలీజ్ అవకాశం ఉందని సమాచారం.
తాజాగా ఆది మరో చేస్తున్నాడు, వినాయకుడు, కేరింత చిత్రాల దర్శకుడు సాయి కిరణ్ అడవి తో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. యూత్ పుల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఎయిర్ టెల్ 4జి గర్ల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా సమాచారం మేరకు బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, పంజా,ఊపిరి, కిక్ వంటి సినిమాలకు రచయితగా పనిచేసిన అబ్బూరి రవి ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో ఆది మంచి విజయం సాధిస్తాడేమో చూద్దాం.