Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'బంపర్ ఆఫర్' పూరీ కొట్టేశారు: ఓ రచయిత గగ్గోలు
పూరీ జగన్నాథ్ నిర్మించిన 'బంపర్ ఆఫర్' చిత్రం కథ తనదేననీ, తనకు తెలియకుండా తన కథతోనే సినిమా తీసి తీరని అన్యాయం చేశారనీ యువ రచయిత, దర్శకుడు ఆర్.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం జరుపుతానంటూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న సినీ రచయితల సంఘం ముందు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అనంతరం సినీ పెద్దల హామీతో దీక్ష విరమించారు.
దీక్ష సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో తాను నవదీప్ హీరోగా 'పొగరుబోతు', సచిన్ తో 'నిను చూడక నేనుండలేను' చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. వీటి తర్వాత తాను రాసుకున్న కథను ఓ తమిళ నిర్మాతను కలిసి సినిమా తీసేందుకు ఒప్పించాననీ, చిత్ర నిర్మాణానికి సన్నాహాలు కూడా జరిగాయనీ చెప్పారు. ఈ కథను తాను హైదరాబాద్ లోని రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయించానని తెలిపారు. ఆ తర్వాత క్రమంలో 'బంపర్ ఆఫర్' విడుదలైందని అన్నారు. తాను తన కథ గురించి మిత్రులకు చెప్పినప్పుడు ఇదే కథతో 'బంపర్ ఆఫర్' సినిమా వచ్చిన విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారనీ, ఆ సినిమా చూసి అందులోని 15 సన్నివేశాల వరకూ తన కథలోని వాటినే వాడుకోవడం తనను అవాక్కయ్యేలా చేసిందనీ తెలిపారు.