Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నా ఇంట్లో రచయిత ఆడియో రిలీజ్.. సంతోషంగా ఉంది.. చంద్రబోస్
Recommended Video
విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో జగపతిబాబు పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ హీరో జగపతిబాబు చిన్న సినిమాలను బతికించడం కోసం నడక ప్రారంభించారు. నేను కూర్చొని సినిమా పాటలు రాసే స్థలంలో రచయిత పాటలు విడుదల చెయ్యటం సంతోషంగా వుంది. జగపతిబాబు నటించిన ఎన్నో సినిమాలకు పాటలు రాసాను. బడ్జెట్ పద్మనాభం సినిమాలో ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే నాకు ఎంతో ఇష్టమైన పాట.
నా 23 సంవత్సరాల సినీ ప్రయాణంలో 800 సినిమాల్లో ౩౩౦౦కు పైగా పాటలు రాయడం జరిగింది. కానీ ఈ సినిమాలో వున్న పాటలు ప్రత్యేకమైనవి. ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు మంచి సంబంధం ఉంది. ఈ సినిమాలోనీ ''యే ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు'అనే పాటను స్వయంగా చంద్రబోస్ పాడి వినిపించారు.