Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా ఇంట్లో రచయిత ఆడియో రిలీజ్.. సంతోషంగా ఉంది.. చంద్రబోస్
Recommended Video
విద్యా సాగర్ రాజు, సంచిత పదుకొనే, శ్రీధర్ వర్మ, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న చిత్రం రచయిత. దర్శకుడు విద్యాసాగర్ రాజ్, కళ్యాణ్ ధూలిపాళ్ల నిర్మాత, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో సోమవారం సినీ రచయిత చంద్రబోస్ ఇంట్లో హీరో జగపతిబాబు పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ హీరో జగపతిబాబు చిన్న సినిమాలను బతికించడం కోసం నడక ప్రారంభించారు. నేను కూర్చొని సినిమా పాటలు రాసే స్థలంలో రచయిత పాటలు విడుదల చెయ్యటం సంతోషంగా వుంది. జగపతిబాబు నటించిన ఎన్నో సినిమాలకు పాటలు రాసాను. బడ్జెట్ పద్మనాభం సినిమాలో ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే నాకు ఎంతో ఇష్టమైన పాట.
నా 23 సంవత్సరాల సినీ ప్రయాణంలో 800 సినిమాల్లో ౩౩౦౦కు పైగా పాటలు రాయడం జరిగింది. కానీ ఈ సినిమాలో వున్న పాటలు ప్రత్యేకమైనవి. ఈ సినిమా దర్శక నిర్మాతలతో నాకు మంచి సంబంధం ఉంది. ఈ సినిమాలోనీ ''యే ఎదలో ఏముంటుందో ఎవరికి తెలుసు'అనే పాటను స్వయంగా చంద్రబోస్ పాడి వినిపించారు.