Don't Miss!
- News ఏపీలో దంచికొడుతున్నఎండలు.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
బోయపాటి శ్రీను ఒక మూర్ఱమైన డైరెక్టర్ అంటూ రచయిత సంచలనం!
వైసీపీ, జగన్ మద్దతుదారుడైన తెలుగు సినీ రచయిత చిన్ని కృష్ణ ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా చిన్ని కృష్ణ.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై సంచలన కామెంట్స్ చేశారు. బోయపాటి శ్రీను అనే వ్యక్తి దుబాన్ కోరు డైరెక్టర్.. నిన్నగాక మొన్న ఓ సినిమా తీశాడు. విలన్ తలకాయలను హీరో నరికితే వాటిని గాల్లోనే గద్దలు ఎగరేసుకెళతాయట. అలాంటి సినిమాలు తీసే ఒక మూర్ఱుడు, అజ్ఞాని, ఏమీ తెలియని, పశువుకంటే హీనమైన ఆ డైరెక్టర్తో చంద్రబాబు నాయుడు పుష్కరాల ఏర్పాట్లు చేయించి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారని విమర్శించారు.
చిరంజీవికి 'ఇంద్ర' లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన రచయితను నేను. అలాంటి నాకు ఏనాడైనా ఇస్తరి వేసి భోజనం పెట్టిన కుటుంబమా మీది? అంటూ... పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. చిన్ని కృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఆంధ్రా సెటిలర్లపై దాడులు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చిన్ని కృష్ణ తప్పుపట్టారు. మీ రాజకీయాల కోసం విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు.