Don't Miss!
- News ఏపీలోని ఈ జిల్లాల్లో 44 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక
- Technology ఏప్రిల్ 23 న షియోమీ లాంచ్ ఈవెంట్! 4 కొత్త పరికరాలు లాంచ్ కాబోతున్నాయి!
- Automobiles చీరకట్టులో బైక్ రైడ్ చేసిన ప్రముఖ నటి.. మండిపడుతున్న నెటిజన్లు - ఎందుకంటే?
- Sports IPL 2024: దినేశ్ కార్తీక్ రికార్డ్ సిక్సర్.. స్టేడియం బయట పడ్డ బంతి! వీడియో
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
- Finance War Stocks: ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి.. స్టాక్ మార్కెట్లో రెచ్చిపోయిన 14 స్టాక్స్ ఇవే..!!
తెలుగు దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నం
Recommended Video
తెలుగు రచయిత, దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయన డిప్రెషన్ కారణంగా నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను వెంటనే సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరైన అవకాశాలు లేక, కెరీర్ అనుకున్న విధంగా సాగక సంవత్సర కాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఆయన ఈ చర్యకు పాల్పడ్డట్లు సమాచారం.
తెలుగు హిట్ మూవీ బొమ్మరిల్లుతో పాటు బోని, కాళిదాసు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహ రచయితగా పని చేశారు. దర్శకుడు కావాలనే తన కలను నిజం చేసుకుంటూ 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
2016లో విడుదలైన 'ఒక అమ్మాయి తప్ప' మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీంతో రాజసింహకు అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు సంవత్సర కాలంగా కెరీర్ పరమైన అంశాలతో డిప్రెషన్లో ఉన్న ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్లు సమాచారం.