Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎన్టీఆర్ కి కథ..రాణా కి డైరక్షన్
దగ్గుపాటి రాణా రెండవ చిత్రానికి డైరెక్టర్ గా రచయత జి.యస్.రావు ఎంపికైనట్లు సమాచారం. జి.యస్.రావు చెప్పిన కథకు సురేష్ బాబు ఇంప్రెస్ అవటంతో ఈ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. జి.యస్.రావు గతంలో సింహాద్రి, సాంబ చిత్రాలకు కథలు అందించాడు. అంతే గాక సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా సినిమాలకు కథా చర్చలో ఉన్నాడు. అల్లాగే అతని విజువల్ సెన్స్ బాగా ఉంటుందని ఇండస్ట్రీ లో మంచి పేరు. ఇక రాణా కోసం చెప్పిన కధ పూర్తి యాక్షన్ ఎంటర్ టైనేర్ అని, ఎక్కడా టెంపో తగ్గని విధంగా ఉంటుందని విన్నవారంతా చెప్తున్నారు.
అలేగే జి.యస్.రావు సైతం కొంత కాలంగా సురేష్ గెస్ట్ హౌస్ లో ఉంటూ ఈ కధ నే మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ఓ కొత్త తరహా స్క్రీన్ ప్లే తో నడిచే ఈ కధ కొత్త ట్రెండ్ కు ఆదారం అయ్యే అవకాసం ఉందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినపడుతున్నై. ప్రస్తుతం రాణా మరో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా లీడర్ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రాజకీయం బ్యాక్ డ్రాప్ లో జరుగుతోందని తెలుస్తోంది. ఇక యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అనే మెసేజ్ తో ఈ చిత్రం రూపొందుతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆనందతాండవంలో హీరోయిన్ గా చేస్తున్న రుక్మిణి చేస్తోంది. సంగీతాన్ని మిక్కీజే మేయర్ అందిస్తున్నాడు.