Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ రచయిత త్రిపురనేని మహారథి మృతి
ప్రముఖ సినీ రచయిత త్రిపురనేని మహారథి(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. త్రిపురనేని మరణంతో సినీ రంగంలో విషాదం నెలకొంది. ఆయన ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
త్రిపురనేని బంధిపోటు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, దేశోద్ధారకులు, అన్నదమ్ముల సవాల్, పాడి పంటలు సినిమాలకు రచనలు అందించారు. ఆయన చివరి సారిగా శాంతి సందేశం సినిమాకు మాటలు అందించారు. బందిపోటు, అల్లూరి సీతారామ రాజు సినిమాలతో త్రిపురనేనికి మంచి పేరు వచ్చింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం అన్ని సినిమా ఆఫర్లను వదులుకుని తపస్సులా రచన చేశారు. కృష్ణ నటించిన సింహాసనం చిత్రంలో ఓ కీలక పాత్ర కూడా పోషించారు.
రైతు భారతం, దేశం అంటే మనుషులోయ్ అనే చిత్రాలను స్వయంగా నిర్మించిన త్రిపురనేని స్ర్కీన్ ప్లే అందించడంలో దిట్ట. అప్పట్లో 'త్రిలింగ ప్రజా ప్రగతి' అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రథ యాత్రలు చేశారు.