Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సినిమా నందమూరి వంశానికా? అక్కినేని వంశానికా?
జనవరి 14న బాలీవుడ్ లో విడుదలైన 'యమ్లా, పగ్లా, దీవానా" చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరో ధర్మేంద్ర తన ఇద్దరు కుమారులతో కలిసి నటించారు. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగులోని ఓ పెద్ద నిర్మాత ఈచిత్రం రైట్స్ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ గా సాగే ఈ చిత్రం ఇక్కడ కూడా విజయం సాధిస్తుందని బావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ చిత్రాన్ని అక్కినేని వంశంతో తీయాలా లేక నందమూరి వంశం హీరోలతో తీయాలా అనేదే పెద్ద సందేహంగా తయారైంది.
మరో ప్రక్క కృష్ణవంశీ, నాగార్జన కాంబినేషన్ లో నాగవంశ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సి కళ్యాణ్ నిర్మించనున్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఈ నలుగురూ కలిసి నటిస్తే నటించనున్నారు. ఈ నలుగురు కలిసి నటించే చిత్రానికి సంబంధించి దర్శకుడు కృష్ణవంశీ మంచి కథను తయారు చేసుకున్నారు. కథ నాగార్జునకు నచ్చడంతో పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో పడ్డారు కృష్ణవంశీ. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.