Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వందరోజులు కాకుండానే 'ఏ మాయ చేసావె' డీవిడీ రిలీజ్
నాగచైతన్య రెండో చిత్రం 'ఏ మాయ చేసావె' వీసీడీ, డీవీడీలను నేడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. వందరోజులు పూర్తవకుండా అప్పుడే ఈ చిత్రం డీవీడి రిలీజ్ చేయటం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ స్వరూప్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం ఎనభై ఐదు రోజులు మాత్రమే అయింది. ఇక ఈ డీవీడీలను మార్కెట్ చేస్తున్న ఓల్గా వీడియోస్ సంస్థ అధినేతలు ప్రసాద్, బాబ్జీ మాట్లాడుతూ -"యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ చిత్రం వీడియోను అత్యుత్తమ నాణ్యతతో అందిస్తున్నాం. నేటికి ఈ సినిమా విడుదలై 85వ రోజు. క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే చాలా తొందరగా ఈ చిత్రాన్ని మార్కెట్ చేస్తున్నాం' అని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. అలాగే ఈచిత్రంలో జెస్సీ గా నటించిన సమంతా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయి పెద్ద హీరోలందరి సరసన బుక్కయింది.