డైరెక్టర్ తెలివైనోడు.. నాకు పెద్దగా పని ఉండకపోవచ్చు.. ఎర్రంశెట్టి సాయి
ప్రత ప్రొడక్షన్స్ బ్యానర్పై భరత్' డైరెక్టర్ గా నిర్మాతలు డాక్టర్ శ్రీధర్ రాజు, డాక్టర్ తాళ్ల రవి, డాక్టర్ టిపిఆర్ కలిసి నిర్మిస్తున్న చిత్రం మేరా భారత్ మహాన్. ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్ ఉప శీర్షిక. ఈ సినిమా నవంబర్ 28న అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.
మేరా భారత్ మహాన్ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా సినిమాటోగ్రాఫర్ ముజిర్ మాలిక్ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన త్రిముర్తుల్లాంటి నిర్మాతలకు, దర్శకుడు భరత్కు నా ధన్యవాదాలు. నేను చోటా కే నాయుడు వద్ద అసిస్టెంట్ కెమెరామెన్గా పని చేశాను. అప్పటి నుంచి నాకు భరత్ తెలుసు. అయన పనితీరు చాలా బాగుంటుంది. ఆయనతో కలిసి పని చెయ్యడం ఆనందంగా వుంది. సినిమా కథ బాగుంది. అందరికి నచ్చుతుంది అని అన్నారు.
మాటల రచయిత ఎర్రంశెట్టి సాయి మాట్లాడుతూ.. ఇది చాలా కష్టమైనా కథ. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సమస్యలను గురించి చర్చిస్తూ సాగే కథ. ఇందులో అనుకున్నంత వినోదం ఉండక పోవచ్చు. కానీ ఈ సినిమా మిద యూనిట్ సభ్యులందరికీ పూర్తి నమ్మకం వుంది. దర్శకుడు కూడా చాలా తెలివైన వ్యక్తి కాబట్టి నాకు పెద్దగా పని ఉండక పోవచ్చు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











