Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సమంతకు సాయంత్రంలోగా ఐ లవ్ యూ.. చెప్పేద్దామని
హైదరాబాద్ : నాని, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ చిత్రం కథ గురించి హీరో నాని మాట్లాడుతూ....ఉదయం పదింటికి ఆ భామని చూశాడు. పది గంటల ఒక్క నిమిషానికి ప్రేమలో పడిపోయాడు. మరీ అంత స్పీడా? అనుకోవద్దు. ఆమె అంత బాగుంది మరి. చీర కట్టుకొన్న మల్లెపువ్వులా, సిగ్గు పడుతున్న చందమామలా, విరబూస్తున్న వెన్నెలమ్మలా ఉంది. అందుకే సాయంత్రంలోగా ఐ లవ్ యూ.. చెప్పేద్దామని నిర్ణయించుకొన్నాడు. మరి చెప్పాడా? లేదా? ఈ సంగతి తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు నాని.
సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సి.కళ్యాణ్ మాట్లాడుతూ ''సున్నితమైన ప్రేమకథ ఇది. నాయకానాయికల మధ్య ప్రేమ ఎలా చిగురించింది? ప్రేమలోని భావోద్వేగాలు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని చూపిస్తున్నాం. పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమాని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాము'' అన్నారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.
ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఆ కుర్రాడి మనసు దారి తప్పి ఎటో వెళ్లిపోయింది. ఒంటరైన ఆ కుర్రాడు తన తోడు కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో ఎదురుపడిన ఓ యువతిని... నా మనసు జాడ నీకైనా తెలుసా? నీ వైపే వచ్చినట్లుంది అంటూ ఆరా తీశాడు. మరి ఆ చిన్నదాని సమాధానమేమిటో తెరపైనే చూడాలంటున్నారు . నిర్మాత మాట్లాడుతూ ''మూడు దశల్లో తారసపడ్డ ఓ యువ జంట కథ ఇది. వారి మధ్య ప్రేమ అనేది ఏ క్షణంలో పుట్టిందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకొనేలా సాగుతుంది. ఇళయరాజా బాణీలు చిత్రానికి బలాన్నిస్తాయి''అన్నారు.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్లో హీరోగా నాని నటిస్తుండగా... తమిళ, హిందీ వెర్షన్లలో హీరోలుగా జీవా, ఆదిత్యరాయ్ కపూర్ నటిస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ సమంతానే కథానాయిక కావడం విశేషం. అంటే... ఈ సినిమా ద్వారా సమంత బాలీవుడ్కి పరిచయం కానున్నారన్నమాట. ఈ ప్రేమ కథకు ఇళయరాజా సంగీతాన్ని అందించడం మరో విశేషం. ఈ సినిమాతో సమంత, గౌతమ్ మీనన్లు మరోసారి యువతను 'మాయ'లో పడేయడం ఖాయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.